News May 18, 2024

గుర్రంపోడు: ‘డీఎస్పీ అభ్యర్థి దుర్గాప్రసాద్‌ని పట్టభద్రులు గెలిపించాలి’

image

వరంగల్, ఖమ్మం, NLG పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మామిడి సైదయ్య (జగన్) పట్టభద్రుల ఓటర్లను కోరారు. శుక్రవారం మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు ఒకవైపు, రాజ్యాంగాన్ని తీసివేయాలనే వాళ్ళు ఒకవైపు ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు.

Similar News

News September 13, 2025

నకిరేకల్: విద్యార్థినికి వేధింపులు.. టీచర్ సస్పెండ్..!

image

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌పై <<17696456>>లైంగిక వేధింపుల <<>>ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి విచారణ జరిపి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించారు. నివేదిక అందిన వెంటనే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

News September 13, 2025

సత్తా చాటిన నల్గొండ పోలీస్

image

హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు నిర్వహించిన 7వ ఆల్ ఇండియా జైళ్ల శాఖ క్రీడల్లో 24 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో నల్గొండ జిల్లా జైలు పోలీస్ మామిడి చరణ్ 80 కిలోల విభాగంలో కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చాడు. ఈ విజయంపై జైలు అధికారులు, పోలీసులు శ్రావణ్, గణేష్, సైదులు, రాంబాబు అభినందనలు తెలిపారు.

News September 13, 2025

నల్గొండ: ఆర్టీసీకి రూ.32.59 లక్షల ఆదాయం

image

నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా నాలుగు నెలల్లో రూ.32.59 లక్షల ఆదాయం సమకూరిందని ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. జూన్‌లో 22 బస్సులతో రూ. 11.95 లక్షలు, జూలైలో 22 బస్సులతో రూ. 13 లక్షలు, ఆగస్టులో 18 బస్సులతో రూ. 6.47 లక్షలు, సెప్టెంబర్‌లో 3 బస్సులతో రూ. 1.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు.