News May 18, 2024

పోలీసు అధికార లాంఛనాలతో శ్రీశైలం కానిస్టేబుల్ అంత్యక్రియలు

image

శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో తుపాకితో కాల్చుకొని మృతిచెందిన కానిస్టేబుల్ శంకర్ రెడ్డి అంత్యక్రియలు పోలీసు అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. కర్నూల్ టౌన్ జారహాపురం కేసీ కెనాల్ దగ్గర ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అధికారులు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Similar News

News October 1, 2024

జాతీయ స్థాయి పోటీలకు పత్తికొండ విద్యార్థి ఎంపిక

image

పత్తికొండ ఏపీ మోడల్ స్కూలు సీఈసీ రెండో ఏడాది విద్యార్థి బోయ తేజేశ్వర్ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్, పీడీ రాజశేఖర్ నాయక్ తెలిపారు. విద్యార్థిని కళాశాల బృందం అభినందించింది.

News October 1, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

image

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ షేక్షావలి తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు కర్నూలు స్టేడియంలో జరిగిన ఎంపికలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. తబస్సుమ్ (రగ్బీ), చరణ్ (ఖోఖో), సుధీర్ (కబడ్డీ), షాలెంరాజు (త్రోబాల్), పూజిత (రగ్బీ) ప్రతిభ కనబరిచారన్నారు.

News October 1, 2024

కర్నూలు: సీఎం చంద్రబాబు వరాల జల్లు

image

పత్తికొండ మం. పుచ్చకాయలమడకు CM చంద్రబాబు వరాలు కురిపించారు. 203 మందికి ఇళ్ల మంజూరు, 48 మందికి కొత్త పెన్షన్లు, 15 రేషన్ కార్డులు, ఐదుగురికి NREGC జాబ్ కార్డులు, 3 రేషన్ కార్డులు మంజూరు. 135 ఇళ్లకు ట్యాప్, ఒక ఇంటికి కరెంటు కనెక్షన్, 105 ఇళ్లకు మరుగుదొడ్లు, 1.7 KM డ్రైనేజీ కాలువ, 10.7 KM CC రోడ్డు, 22 మినీ గోకుళాలు.. వీటన్నింటికీ రూ.2.83 కోట్లు మంజూరు. మద్దికెర, పత్తికొండ, హోసూరుకు రోడ్లనిర్మాణం.