News May 18, 2024
జగిత్యాల: చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 10లోపు పాఠశాలలో కనీస సదుపాయాలు పూర్తి చేయాలని, 20 రోజుల వ్యవధిలో మంజూరు చేసిన పనులు పూర్తి చేయాలన్నారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులున్నారు.
Similar News
News October 4, 2024
లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు నమోదు: చందుర్తి CI
బహమతుల ఆశ చూపెడుతూ లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుర్గమ్మ విగ్రహాల వద్ద లయన్స్ యూత్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల వద్ద నుంచి ఒక్కొక్క లక్కీ డ్రా టికెట్ రూ.99 వసూలు చేస్తూ డ్రాలో పాల్గొనాలని ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News October 4, 2024
MLC ఓటర్ నమోదుపై రాజకీయ నాయకులతో సమావేశం
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై కరీంనగర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీఓ మహేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితాపై సలహాలు, సూచనలు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
News October 4, 2024
జగిత్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 14 రోజుల రిమాండ్
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పోక్సో కేసులో 14 రోజుల రిమాండ్ను మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితేందర్ విధించారు. ఓ ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి గురువారం రాత్రి జగిత్యాల సబ్ జైలుకు అతడిని తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.