News May 18, 2024
ఏ ప్రభుత్వమూ రాజ్యాంగాన్ని మార్చలేదు: గడ్కరీ

రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వమూ మార్చలేదని బీజేపీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు చూస్తోందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగంలో కేవలం సెక్షన్లు మార్చడం, సవరించేందుకు అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 80సార్లు రాజ్యాంగాన్ని సవరించి పాపం మూటగట్టుకుందని విమర్శించారు.
Similar News
News September 15, 2025
భారత రత్నం మోక్షగుండం

దేశం గర్వించే ఇంజినీర్లలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ముందు వరుసలో ఉంటారు. 1908లో HYDలో మూసీ పొంగి 15వేల మంది మరణిస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి వరద నివారణకు కృషి చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారి జలాశయాలకు ఆటోమేటిక్గా వరద గేట్లు తెరిచే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ విధానమే అమలులో ఉంది. ఆయన సేవలకు భారత రత్నతో సత్కరించిన కేంద్రం ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా నిర్వహిస్తోంది.
News September 15, 2025
కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.
News September 15, 2025
మైథాలజీ క్విజ్ – 6

1. వ్యాస భాగవతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి?
3. కంసుడు పరిపాలించిన రాజ్యం?
4. మొధెరా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రావణ మాసం పౌర్ణమి నాడు వచ్చే పండగ ఏది? (సరైన సమాధానాలను కామెంట్ చేయండి. జవాబులను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
<<17696624>>మైథాలజీ క్విజ్ – 5<<>> ఆన్సర్స్: 1.భూమి, ఆకాశం 2.త్రయంబకేశ్వర ఆలయం 3.మాఘ మాసం 4.భీష్ముడు 5.సీత