News May 18, 2024
పెంచలకోనకు ప్రత్యేక బస్సులు

పెంచలకోనలో రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాపూరు డిపో మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. వెంకటగిరి, రాపూరు, గూడూరు, నెల్లూరు, ఆత్మకూరు, రాజంపేట, బద్వేలు డిపోల నుంచి 120 బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులన్నీ 22న అందుబాటులో ఉంటాయని, మిగిలిన రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా నడుపుతామన్నారు.
Similar News
News March 24, 2026
నెల్లూరు జిల్లాలో సదరం స్లాట్ ప్రారంభం

నెల్లూరు జిల్లాలో కొన్ని ఏళ్లుగా దివ్యాంగులు సదరం స్లాట్ల బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని అన్ని సచివాలయాల్లో మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సమాచారం అందుకున్న దివ్యాంగులు ఆయా సచివాలయాలకు సమగ్ర వివరాలతో వెళ్లి నమోదు చేయించుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డు, ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్ వెంట తీసుకుని వెళ్లాలి.
News March 24, 2026
నెల్లూరు: రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

నెల్లూరు రైల్వే స్టేషన్లో ఒకరు చనిపోయారు. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న రైలు నుంచి జారిపడి సోమవారం రాత్రి ఒకరు మృతిచెందారు. అతని వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చు. 5.4 అడుగుల ఎత్తు చామన ఛాయ రంగు కలిగి ఉన్నాడు. గ్రీన్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్యాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్ఐ హరి చందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 24, 2026
కావలి: సార్.. నేనే బతికే ఉన్నా..!

నెల్లూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. కావలి మండలం అన్నగారిపాలేనికి చెందిన బొబ్బల రమణమ్మ ఆధార్ కార్డు తీసుకుని రేషన్ షాపు వద్దకు వెళ్లారు. బియ్యం ఇవ్వాలని అడిగితే ‘నువ్వు చనిపోయావని చూపిస్తోంది. నీకు బియ్యం ఇవ్వడం కుదరదు’ అని డీలర్ చెప్పారు. తానే బతికే ఉన్నానని.. ప్రతినెలా పెన్షన్ కూడా ఇస్తున్నారని ఆమె చెప్పారు.


