News May 18, 2024
అల్లర్లపై రెండు రోజుల్లో సిట్ నివేదిక

APలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ నుంచి రెండు రోజుల్లో నివేదిక వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అల్లర్లు జరిగిన పల్నాడు, చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేటకు సిట్ బృందాలు బయలు దేరాయి. నివేదిక రాగానే దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సమాచారం.
Similar News
News November 5, 2025
విమాన ప్రయాణికులకు శుభవార్త

విమాన టికెట్ల రద్దు అంశంపై ప్రయాణికులకు DGCA గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్లు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి ఛార్జీ లేకుండా రద్దు చేసుకోవడం/ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. క్రెడిట్ కార్డు ద్వారా అయితే 7 రోజుల్లో, ట్రావెల్ ఏజెంట్/పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే 21 పనిదినాల్లో రిఫండ్ అందుతుంది. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5D, ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో 15D లోపు ఈ సౌకర్యం వర్తించదు.
News November 5, 2025
ఈ ఫేస్ ప్యాక్తో ఎన్నో లాభాలు

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.
News November 5, 2025
పంచాయతీ కార్యదర్శులపై కీలక నిర్ణయం

AP: గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్(GPDO)గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వేతనాల్లో మార్పుల్లేకుండా ప్రస్తుతమున్న 5 కేడర్లను నాలుగుకు కుదించింది. ఇకపై 7,224 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పనిచేయనున్నాయి. 359 అర్బన్, 3,082 గ్రేడ్-1, 3,163 గ్రేడ్-2, 6,747 గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. అదే మాదిరిగా ఉద్యోగుల కేడర్ మారింది.


