News May 18, 2024
EAPCET టాప్ ర్యాంకర్లు ఎవరంటే?

తెలంగాణ EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన జ్యోతిరాదిత్య ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మదనపల్లెకు చెందిన ప్రణీత తొలిస్థానంలో నిలిచారు. ఈఏపీ సెట్కు 3,32,251 మంది హాజరయ్యారని, అందులో ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618, అగ్రికల్చర్, ఫార్మసీ 91,633 మంది విద్యార్థులున్నారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
Similar News
News January 22, 2026
డ్రాగన్ ఫ్రూట్ సాగు.. అనువైన నేలలు, నాటే సమయం

డ్రాగన్ ప్రూట్ పంట ఏ నేలలోనైనా పండుతుంది. అయితే రాళ్ల భూమి, ఎర్ర భూములు ఎక్కువ అనుకూలం. పంటను బెడ్ పద్ధతిలో వేసుకుంటే మంచిది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పంటను నాటుకోవడం శ్రేయస్కరం. ఈ నెలల్లో కాయను కత్తిరించిన మొక్క నుంచి కొమ్మను మనం స్వయంగా చూసి తెచ్చుకొని నాటితే అది 6 నుంచి 9 నెలల్లో కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటే మొక్కలు బతికే అవకాశం ఎక్కువ.
News January 22, 2026
నేడు కోటప్పకొండకు పవన్ కళ్యాణ్

AP: నేడు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు హెలికాప్టర్లో కోటప్పకొండకు చేరుకోనున్నారు. ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మార్గం మధ్యలో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. తర్వాత కోటప్పకొండ-కొత్తపాలెం మధ్య రూ.3.9 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలపై పవన్ సమీక్ష చేయనున్నారు.
News January 22, 2026
వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27(మంగళవారం)న సమ్మె జరగనుంది. వారానికి ఐదు పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజుల్లో డిజిటల్, ఏటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ఏమైనా బ్యాంక్ పనులుంటే ఇవాళ, రేపు ప్లాన్ చేసుకోవడం మేలు.


