News May 18, 2024

ఈ నెల 25న అమెరికాకు భారత జట్టు

image

టీ 20 వరల్డ్ కప్ కోసం ఈ నెల 25న భారత జట్టు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం కొందరు ఆటగాళ్లు ఆ రోజు పయనం కానున్నట్లు సమాచారం. అలాగే ఫైనల్ అనంతరం ఈ నెల 27న మిగిలిన ఆటగాళ్లు యూఎస్ విమానం ఎక్కనున్నట్లు టాక్. తొలుత రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రా, పంత్, అక్షర్, అర్ష్‌దీప్, సిబ్బంది వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది.

Similar News

News January 13, 2026

పాదాల అందం కోసం

image

మన శరీరంలోనే భాగమైన పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోం. దీని వల్ల మ‌డమలకు పగుళ్లు వచ్చి తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిట్కాలు పాటించి ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. * పాదాల పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత‌ శుభ్రం చేసుకుంటే ఫ‌లితం ఉంటుంది. * ఓట్‌మీల్‌, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.

News January 13, 2026

భోగి మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదంటే?

image

భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్, రబ్బర్, టైర్లను వేయకూడదు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఆ విషపూరిత పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆవు పిడకలు, ఔషధ గుణాలున్న కట్టెలు వేయాలి. ఇలాంటి హానికరమైన పదార్థాలను వాడటం శ్రేయస్కరం కాదు. పర్యావరణాన్ని కాపాడుతూ, మన ఆరోగ్యానికి భంగం కలగకుండా భోగి వేడుకలను జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News January 13, 2026

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 84,038 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 25,836 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌-30 సూచీలో ఎటర్నల్, టెక్ మహీంద్రా, SBI, BEL, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎల్ అండ్ టీ, TCS, రిలయన్స్, M&M, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.