News May 19, 2024
కృష్ణా: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ కారణంగా విజయవాడ మీదుగా తిరుపతి, కాకినాడ మధ్య ప్రయాణించే ఎక్స్ప్రెస్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెం.17249 తిరుపతి- కాకినాడ టౌన్ ట్రైన్ను జూన్ 3 వరకు, నెం.17250 కాకినాడ టౌన్- తిరుపతి ట్రైన్లను జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
Similar News
News November 8, 2025
కోడూరు: కూలికి వెళ్లి అనంత లోకాలకు..!

వ్యవసాయ కూలి పనుల వెళ్లి విగత జీవిగా యువకుడు కాటికి చేరిన సంఘటన కోడూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓలేటి ఇంద్ర బాబు(27), ఇతర వ్యవసాయ కార్మికులతో ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో కరెంటు షాక్ గురై అక్కడకక్కడే మృతి చెందాడని ఇంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 8, 2025
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.
News November 7, 2025
ఓటర్ల అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో బుక్ ఏ-కాల్ విత్-బి.ఎల్ఓకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న 82 ఓటర్ల అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ బాలాజీ ఎన్నికల అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్ర వ్యాప్తంగా ‘బుక్ ఏ-కాల్ విత్-బీఎల్ఓ పేరిట ఓటర్ల సౌకర్యం కోసం ఈసీఐ వెబ్సైట్ ద్వారా నూతన విధానంలో ఒక వేదికను ఏర్పాటు చేశారన్నారు.


