News May 19, 2024

పార్వతీపురం: తెలంగాణ ఎంసెట్‌లో శ్రీనిధి ప్రతిభ

image

కొమరాడ మండలం దళాయిపేటకి చెందిన ధనుకొండ శ్రీనిధి తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ధనుకొండ శ్రీనివాసరావు, సుశీల ఇద్దరూ ఉపాధ్యాయులే. శ్రీనివాసరావు నెల్లిమర్ల మండలం సారిపల్లి జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్నారు. శ్రీనిధి పదో తరగతిలో కూడా మంచి మార్కులు సాధించింది. విద్యార్థినిని ఆమె తల్లిదండ్రులు, బంధువులు అభినందించారు.

Similar News

News February 7, 2026

VZM: మార్చి 31లోగా ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కృష్ణ తేజ ఆదేశించారు. శుక్రవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఉపాధి హామీ పనులపై కమీషనర్ సమీక్షించారు. తక్కువ పురోగతి ఉన్న గంట్యాడ, వేపాడ, గరివిడి, గజపతినగరం, జామి మండలాలు మార్చి 15లోగా పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

News February 7, 2026

VZM: పన్నులు వసూలు చేయకపోతే చర్యలు తప్పవు: కమిషనర్

image

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ఫిబ్రవరి 15 నాటికి శతశాతం పన్నులు వసూలు కావాలని పంచాయితీ రాజ్ కృష్ణ తేజ ఆదేశించారు. పట్టణంలోని ఓ హోటల్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ నెల 28లోపు లక్ష్యాలను పూర్తి చేయాలని, ఫిబ్రవరి 15లోపు శతశాతం వసూలు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 7, 2026

VZM: పన్నులు వసూలు చేయకపోతే చర్యలు తప్పవు: కమిషనర్

image

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ఫిబ్రవరి 15 నాటికి శతశాతం పన్నులు వసూలు కావాలని పంచాయితీ రాజ్ కృష్ణ తేజ ఆదేశించారు. పట్టణంలోని ఓ హోటల్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ నెల 28లోపు లక్ష్యాలను పూర్తి చేయాలని, ఫిబ్రవరి 15లోపు శతశాతం వసూలు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.