News May 19, 2024

మెదక్: ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటి వరకు 44,685 మంది రైతుల నుంచి 1,94,666 టన్నులు సేకరించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 34 బాయిల్డ్, 23రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించినట్లు తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు సిద్దిపేట జిల్లాకు 10 వేల టన్నులు పంపినట్లు తెలిపారు. రానున్న 5 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News January 7, 2026

మెదక్: 108 సిబ్బందికి అత్యవసర వైద్య శిక్షణ

image

మెదక్ జిల్లా కేంద్రంలో 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు ‘రిఫ్రెష్ ట్రైనింగ్’ నిర్వహించారు. అత్యవసర సమయంలో గర్భిణులకు అంబులెన్స్‌లోనే సురక్షితంగా కాన్పు చేయడం, నవజాత శిశువుల సంరక్షణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణనష్టం నివారించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ సంపత్, ఇన్‌స్ట్రక్టర్ అరవింద పాల్గొన్నారు.

News January 7, 2026

మెదక్: ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన డీఎస్పీ

image

విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్‌ను TUWJU నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ రియాజుద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఇంతియాజుద్దీన్, సబ్దర్ అలీ, యూసుఫ్ అలీలు ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సేవలను నాయకులు కొనియాడారు.

News January 6, 2026

మెదక్: పొరపాటు లేకుండా తుది ఓటరు జాబితా రూపకల్పన: కలెక్టర్

image

పొరపాటు లేకుండా తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.