News May 19, 2024

మెదక్: ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ ఆత్మహత్య

image

మనస్తాపం చెందిన ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లి మృతదేహంగా లభ్యమైంది. కొల్చారం ఎస్ఐ మహ్మద్‌గౌస్ తెలిపిన వివరాలు.. మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన మల్లయ్య, రాజమ్మ దంపతులకు ఒక్క కుమార్తె సుజాతను రాజయ్య అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈనెల 16న తల్లి రాజమ్మ, సుజాతలకు గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంజీరా నదిలో శవం లభ్యమైంది. భర్త రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదైందని ఎస్సై తెలిపారు.

Similar News

News October 4, 2024

MDK: మొదలైన సందడి.. నామినేటెడ్ ఆశలు?

image

మెదక్ జిల్లాలో ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, దేవాదాయ శాఖ, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ పాలక మండళ్లు ఖాళీగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ గురించి చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలోని ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News October 4, 2024

మెదక్: పెరిగిన ధరలు సామాన్యుల ఇక్కట్లు

image

ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కూరగాయల రేట్లు కొండెకాయి. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగే గ్రామీణ ప్రాంత సంతలో టమాటా కిలో రూ.50 – 80, బీరకాయలు 60 -70, బెండకాయలు 50 – 80, పచ్చి మిర్చి 80 – 100 వరకు ఉంది.

News October 3, 2024

KCR.. వాళ్లని కంట్రోల్ చేయ్: MP

image

HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.