News May 19, 2024

నాలుగు నెలల్లోనే 1,300 ఫోన్లు ట్యాపింగ్?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. MLA ఎన్నికల ముందు ఆగష్టు నుంచి నవంబర్ వరకు 1,300 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. SIB కేంద్రంగా ఈ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. ఎన్నికలు ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. BRS అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల ఫోన్లే ట్యాప్ అయినట్లు టాక్. అధికారులు ఫోన్ ట్యాప్ బాధితుల వాంగ్మూలం తీసుకుంటున్నట్లు సమాచారం.

Similar News

News January 14, 2026

T20 వరల్డ్ కప్‌: USA ప్లేయర్ల వీసాపై ఉత్కంఠ

image

T20 వరల్డ్ కప్‌కు ముందు USA క్రికెట్ జట్టుకు అనూహ్య సమస్య ఎదురైంది. పాకిస్థాన్ సంతతికి చెందిన అలీఖాన్, షయాన్ జహంగీర్, మొహమ్మద్ మొహ్సిన్, ఎహ్సాన్ ఆదిల్‌లు భారత్‌కు వచ్చేందుకు వీసా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలోని భారత హైకమిషన్‌లో వీసా ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ విదేశాంగ శాఖ నుంచి తుది అనుమతులు అవసరమని అధికారులు తెలిపారు. అయితే ఇది సాధారణ ప్రక్రియేనని ICC వర్గాలు స్పష్టం చేశాయి.

News January 14, 2026

మరో 9 అమృత్‌ భారత్‌ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

image

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్‌పాయ్‌గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.

News January 14, 2026

జనవరి 14: చరిత్రలో ఈరోజు

image

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం(ఫొటో-R)
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం(ఫొటో-L)
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం