News May 19, 2024

తూ.గో.: మరో 15 రోజులే.. మీ MLA ఎవరు..?

image

ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. మన MLA ఎవరనేది తేలిపోనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు గెలుపోటములు, మెజారిటీలపై పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం రూ.లక్షల్లో సాగుతుందని టాక్. మరోవైపు పలు పార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు.
– మరి మీ MLA ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?

Similar News

News September 18, 2025

రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

image

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.

News September 18, 2025

బయోలాజికల్ కంట్రోల్ లాబరేటరీ పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

image

నిడదవోలులో వ్యవసాయ శాఖ నడుపుతున్న బయోలాజికల్ కంట్రోల్ లాబోరేటరీని బుధవారం జిల్లా వ్యవసాయా ధికారి ఎస్.మాధవరావు సందర్శించారు. లేబోరేటరీ ద్వారా రైతులకు జీవ నియంత్రణ కారాకాలైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమో నాస్ ఫ్లోరిసెన్స్ తదితర జీవ శిలీంద్ర నాశనాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వీటి ద్వారా వరి, పొగాకు, అరటి, నిమ్మ కూరగాయలు పంటలకు వచ్చే పొడ తెగులు, కాండం, వేరు కుళ్లు నియంత్రించవచ్చునన్నారు.

News September 17, 2025

రాజమండ్రి : రాష్ట్ర సమాచార కేంద్రం ఏడీగా రామచంద్రరావు

image

ఏలూరు జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న ఆర్.వి.ఎస్. రామచంద్రరావు పదోన్నతిపై రాజమహేంద్రవరం రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకుడిగా బుధవారం విధుల్లో చేరారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మణా చార్యులు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇన్‌ఛార్జి సహాయ సంచాలకుడు రామచంద్రరావుకు సిబ్బంది ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు.