News May 19, 2024

రాజుపాలెం: ట్రాక్టర్ పైనుంచి పడి ఉపాధి కూలి మృతి

image

రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఉపాధి కూలి వేంపల్లి సుబ్బరాయుడు (60) ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. శనివారం ఉపాధి హామీ పథకం పనుల కోసం ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తుండగా ట్రాలీ డోర్ కున్న సపోర్టు కడ్డీ విరగడంతో సుబ్బరాయుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏపీడీ ఆనందం, ఏపీఓ లక్ష్మీనారాయణ సుబ్బరాయుడు మృతదేహానికి నివాళి అర్పించారు.

Similar News

News November 2, 2025

ప్రొద్దుటూరు: అక్టోబర్‌లో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

image

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.

News November 2, 2025

ప్రొద్దుటూరు: గతనెలలో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

image

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.

News November 1, 2025

కడప: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

image

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను ఎస్పీ నచికేత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో వారు కలుసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో శాంతిభద్రతల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.