News May 19, 2024

విజిలెన్స్ ఎంక్వయిరీని ఆహ్వానించిన కేయూ వీసీ

image

కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వేసిన విజిలెన్స్ విచారణ కమిటీని స్వాగతిస్తున్నానని తెలిపారు. తాను ఇక్కడే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి, ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించి ఇక్కడే ఉద్యోగం పొంది 30 సంవత్సరాలకు పైగా నిబద్ధతగా పనిచేశానన్నారు.

Similar News

News February 26, 2026

ఏనుమాముల మార్కెట్‌లో ఉద్యోగుల బదిలీ

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను
అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్‌ను ఎనుమాముల మార్కెట్ లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు. ఈ అంతర్గత బదిలీలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

News February 26, 2026

సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం: కలెక్టర్

image

కాకతీయ కెనాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్ పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.

News February 26, 2026

వరంగల్: వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ

image

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్‌కె సేవాసమాజ్ ప్రాంతంలో బుధవారం దొంగతనం జరిగింది. బాధితురాలు దాస విజయ వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు పుస్తెలతాడు, సెల్‌ఫోన్, రూ.2,500 నగదు ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.99,500 ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.