News May 19, 2024

లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్త్: గుంటూరు ఎస్పీ

image

జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తుషార్ తెలిపారు. ఆదివారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా.. ఎక్కడా నలుగురికి మించి గుంపులుగా ఉండకూడదని తెలిపారు. అనుమతులు లేకుండా బాణాసంచా కాల్చిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 15, 2026

GNT: జీఎంసీ నేటి సంక్రాంతి సంబరాలు ఇవే!

image

గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ స్థలంలో ఉదయం 9 గంటల నుంచి పొంగళ్లు, కోడి పందేలు, కర్రసాము, ఖోఖో, సాయంత్రం 5 గంటల నుంచి సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రి, బహుమతుల ప్రదానం జరగనుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం NTR స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి మ్యూజికల్ నైట్ ఉంటుంది.

News January 15, 2026

సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

image

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News January 15, 2026

సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

image

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.