News May 19, 2024
ఎస్.కోట: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన అప్పలస్వామి అనే గొర్రెల కాపరి ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఎప్పటిలాగే తన మేకలను మేపేందుకు గ్రామ సమీపంలో మెట్టకు వెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినప్పటికీ అప్పలస్వామి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెతికారు. ఈ నేపథ్యంలో అప్పలస్వామి గ్రామ సమీపంలో పిడుగు పడి మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తీవ్రంగా రోదిస్తూ వెల్లడించారు.
Similar News
News January 11, 2026
VZM: 63 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(KGBV) మొత్తం 63 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3లో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్-10, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్-12, ANM-7, అటెండెర్-3, హెడ్ కుక్-1, ASST కుక్-2, వాచ్ ఉమెన్-1 ఉండగా.. టైప్-4లో వార్డెన్-4, పార్ట్ టైమ్ టీచర్-7, చౌకిదార్-5, హెడ్ కుక్-3 ASST కుక్-8 ఉన్నాయి. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.
News January 11, 2026
ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు: వైసీపీ

గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఐదు గిరిజన గ్రామాల ప్రజలను ట్రైబల్ అధికారులు పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది. సుమారు 100 కుటుంబాలు సమస్యలతో బాధపడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకొని మెడకు ఉరి తాళ్లు బిగించుకొని గిరిజనులు వినూత్న నిరసన చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంది. ‘ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు?’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
News January 11, 2026
సంక్రాంతి లోపు రైతులకు ధాన్యం డబ్బులు: మంత్రి కొండపల్లి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తిచేసి, సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను శనివారం ఆదేశించారు. విజయనగరం జిల్లాకు అదనంగా కేటాయించిన 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు సమీప జిల్లాల్లో అమ్ముకునేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో సమస్యలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.


