News May 20, 2024
ప.గో.: వేధింపులపై మహిళ ఫిర్యాదు

తన భర్త మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని కొవ్వూరు పట్టణానికి చెందిన ఓ వివాహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బాబురావు ఆదివారం తెలిపారు. ద్వారపూడికి చెందిన సారాదేవికి కొవ్వూరుకు చెందిన విజయ్ కుమార్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. నెలరోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత విజయ్ తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
Similar News
News January 12, 2026
ప.గో: నేటి పీజీఆర్ఎస్కు 211 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 211 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 12, 2026
ప.గో: నేటి పీజీఆర్ఎస్కు 211 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 211 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 12, 2026
ఒకేరోజు 7 చిత్రాల ట్రైలర్స్ విడుదల చేస్తా: నిర్మాత తుమ్మలపల్లి

ఈ ఏడాది ఆగస్టు 15 లోపు 15 చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. సోమవారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఒకేసారి ప్రారంభించిన 15 చిత్రాలలో ఇప్పటికే 7 చిత్రాల షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. భీమవరం టాకీస్ పతాకంపై రూపొందిన ఈ 7చిత్రాల ట్రైలర్లను కూడా ఒకేరోజు ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.


