News May 20, 2024

బుక్కరాయసముద్రం: ఈతకు వెళ్లి  బాలుడి మృతి

image

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో విషాదం అలుముకుంది. ఆదివారం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమామ్ బాషా (12) స్నేహితులలో కలిసి చిక్కవదియర్ చెరువులో ఈతకు వెళ్లి… ప్రమాదవ శాత్తు నీటి గుంటలో పడి మునిగిపోయాడు. పక్కనున్న పిల్లలు చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా..వారు గాలించి బయటకు తీసి మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 24, 2026

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలి: DRO మలోల

image

గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని DRO మలోల అధికారులను ఆదేశించారు. శనివారం అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు జరుగుతాయని తెలిపారు. గ్రౌండ్ వైట్‌వాష్, విద్యుత్, శానిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య శిబిరం, తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

News January 24, 2026

అనంతపురం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

image

అనంతపురం కలెక్టరేట్‌లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మలోలతో పాటు జిల్లా ఫారెస్ట్ అధికారి రామకృష్ణారెడ్డి, జిల్లా ట్రెజరీ అధికారి రమణయ్య, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. “జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర” థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి కార్యాలయ పరిసరాలు శుభ్రం చేశారు.

News January 24, 2026

ఎస్కేయూ బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంచార్జ్ ఉపకులపతి అనిత తన చాంబర్‌లో వీటిని ప్రకటించారు. మొత్తం 722 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 670 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 92.80గా నమోదైందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, ప్రొఫెసర్ జివి రమణ, శ్రీరామ్ నాయక్ పాల్గొన్నారు.