News May 20, 2024
SP బిందు మాధవ్తో మాకు సంబంధాలు లేవు: శ్రీకృష్ణదేవరాయలు

AP: పల్నాడు జిల్లాలో ఓటింగ్ టీడీపీ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. తాను పోలింగ్ రోజున ఎలాంటి హింసను ప్రేరేపించలేదని స్పష్టం చేశారు. ఎస్పీ గరికపాటి బిందు మాధవ్తో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. తనకు పోలీసులెవరూ సాయం చేయలేదని, కాల్ డేటాను సిట్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
ప్రజల కోసమే మోదీని కలుస్తున్నా: CM

TG: తాను అభివృద్ధి కోసం, నిధుల కోసం ఎవరినైనా కలుస్తానని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘నేను పదేపదే ప్రధానిని కలుస్తానని చాలా మంది అంటుంటారు. మోదీ నాకు బంధువు కాదు. ఆయన దేశానికి ప్రధాని. ఎన్నికల వరకే రాజకీయం. ప్రధాని అనుమతిస్తేనే నిధులు వస్తాయి. నాకు పర్సనల్ అజెండా లేదు. గత ప్రభుత్వం పదేళ్లు కేంద్రాన్ని అడగలేదు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అందుకే మోదీని కలుస్తున్నా’ అని నిర్మల్ సభలో తెలిపారు.
News January 16, 2026
షుగర్ పేషంట్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా?

డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గడానికి ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ చేయడం మంచిదే. కానీ జాగ్రత్తలు తప్పనిసరి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినా.. సరైన ప్లాన్ లేకపోతే ప్రాణాల మీదకు రావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు తినకుండా ఉంటే షుగర్ లెవల్స్ పడిపోతాయి. అలాగే ఉపవాసం తర్వాత ఒక్కసారిగా తింటే షుగర్ అదుపు తప్పుతుంది. అందుకే టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు, గర్భిణులు దీనికి దూరంగా ఉండాలి.
News January 16, 2026
కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధి కాలేదు: సీఎం

TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ‘ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావాల్సినంత అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ అనుకుంటే పదేళ్ల పాలనలో అభివృద్ధి చెంది ఉండేది. పాలమూరు జిల్లాతో పాటు సమానంగా నిధులు ఇస్తా. నిర్మల్కు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, కొత్త స్టేడియం మంజూరు చేస్తాం’ అని నిర్మల్ సభలో ప్రకటించారు.


