News May 20, 2024

SP బిందు మాధవ్‌తో మాకు సంబంధాలు లేవు: శ్రీకృష్ణదేవరాయలు

image

AP: పల్నాడు జిల్లాలో ఓటింగ్ టీడీపీ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. తాను పోలింగ్ రోజున ఎలాంటి హింసను ప్రేరేపించలేదని స్పష్టం చేశారు. ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. తనకు పోలీసులెవరూ సాయం చేయలేదని, కాల్ డేటాను సిట్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News July 9, 2025

2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ ఇవే!

image

2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ జాబితాను IMDb విడుదల చేసింది. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ మూవీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. రెండు, మూడు స్థానాల్లో డ్రాగన్, దేవా సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత రైడ్ 2, రెట్రో, ద డిప్లొమాట్, ఎంపురన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విదాముయర్చి చిత్రాలు ఉన్నాయి. కాగా టాలీవుడ్ నుంచి ఒక్క మూవీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.

News July 9, 2025

HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా అదనంగా మరో 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో విజిలెన్స్ <<16524630>>రిపోర్టు<<>> ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.

News July 9, 2025

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

image

TG: తమ రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని సీఎం రేవంత్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కేంద్ర ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ‘తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని జిల్లాలకు యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కాస్త యూరియా వాడకం తగ్గిస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.