News May 20, 2024

ఏపీ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందించిన SIT

image

AP: ఎన్నికల రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి.. డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తాకు అందజేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిలాల్లో మొత్తం 33 చోట్ల అల్లర్లు జరిగినట్లు అందులో పేర్కొంది.
1370 మందిపై FIR నమోదు చేయగా.. 124 మందిని అరెస్ట్ చేశామని, 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీ.. కాసేపట్లో సీఈవో, సీఈసీకి పంపనున్నారు.

Similar News

News February 20, 2026

యూరియా, వేపపిండిని కలిపి వాడటం వల్ల లాభాలు

image

సాధారణంగా పంటకు వేసిన యూరియా త్వరగా ఆవిరికావడం, నీళ్లలో కొట్టుకుపోవడం జరుగుతుంది. దీన్ని వేపపిండితో కలిపి వాడితే యూరియాలో నత్రజని నెమ్మదిగా కరిగి మొక్కలకు స్థిరంగా, ఎక్కువ కాలం పాటు అందుతుంది. దీని వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నత్రజని వృథా 20-30% తగ్గుతుంది. నేల ఆరోగ్యం పెరిగి, వేరుకుళ్లు, నులి పురుగుల సమస్య తగ్గుతుంది. 50 కేజీల యూరియాకు నిపుణుల సూచనలతో 5KGల వేపపిండి కలపడం మంచిది.

News February 20, 2026

ఏఐ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో CBN భేటీ కానున్నారు. ఉదయం ప్లీనరీ సెషన్‌లో, మధ్యాహ్నం WEF నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మరోవైపు తెలంగాణ ఏఐ పాలసీపై CM రేవంత్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో ఏఐ అభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రోత్సాహం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులపై మాట్లాడనున్నారు.

News February 20, 2026

కోటి విద్యలకంటే కోరుకొని పొలం దున్నడం మేలు

image

లోకంలో వేల సంఖ్యలో విద్యలు, వృత్తులు ఉన్నాయి. ఎవరు ఏ ఉద్యోగం, పని చేసినా అది ఆహారం కోసమే. మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించినా ఆకలి తీర్చుకోవడానికి అన్నమే తినాలి. ఆ అన్నాన్ని పండించేది వ్యవసాయం మాత్రమే. కాబట్టి ఇతరుల దగ్గర బానిసలుగా, ఒత్తిడితో ఉద్యోగాలు చేయడం కంటే వ్యవసాయం చేస్తూ కష్టపడి బతకడం మేలని, ఇది మనిషికి మానసిక తృప్తిని, స్వేచ్ఛను ఇస్తుందని ఈ సామెత చెబుతుంది.