News May 20, 2024
లంచగొండులకు నిద్రలేని రాత్రులే

గతంలో ఏసీబీకి చిక్కిన అధికారుల గురించి చాలా అరుదుగా వార్తలొచ్చేవి. కానీ ఏడీజీ సీవీ ఆనంద్ ACB చీఫ్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత అధికారులు దూకుడు పెంచారు. ఇవాళ రైతు నుంచి లంచం తీసుకుంటూ కమలాపూర్ MRO మాధవి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని నానాజిపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాధికారెడ్డి, బిల్ కలెక్టర్ బాలరాజు రూ.35వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కారు. లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయండి.
Similar News
News January 13, 2026
గర్భిణులు నువ్వులు తినకూడదా?

పండుగ పిండివంటల్లో ఎక్కువగా నువ్వులను వాడుతుంటారు. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్యాలకు చెక్ పెడతాయి. అయితే గర్భిణులు మాత్రం నువ్వులు తినకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే గర్భిణులు నువ్వులు తినడం వల్ల గర్భాధారణ సమయంలో తల్లికి అవసరం అయ్యే పోషకాలు, క్యాల్షియం, విటమిన్స్, అమినోయాసిడ్స్, ప్రోటీన్స్, ఐరన్ పుష్కలంగా అందుతాయి. కానీ చాలా మితంగా తీసుకోవాలి.
News January 13, 2026
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ రిటైర్మెంట్ ప్రకటించారు. మార్చిలో టీమ్ ఇండియాతో జరగబోయే హోమ్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానన్నారు. 15ఏళ్ల కెరీర్లో వికెట్ కీపర్ బ్యాటర్గా అన్ని ఫార్మాట్లలో కలిపి 300దాకా మ్యాచులాడారు. 7వేలకు పైగా రన్స్ చేశారు. 275మందిని ఔట్ చేశారు. ’35 ఏళ్ల వయసులోనూ AUS తరఫున ఆడాలనే ఉంది. కానీ నాలో పోటీతత్వం సన్నగిల్లింది’ అని అన్నారు.
News January 13, 2026
స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్

ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్మెంట్ కేసును విజయవాడ ACB కోర్టు మూసివేసింది. CID నివేదికకు ఆమోదం తెలుపుతూ CM చంద్రబాబు సహా 37 మందిపై విచారణను క్లోజ్ చేసింది. ‘మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్’గా నిందితులందరికీ విముక్తి కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అటు తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలన్న స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి ఛైర్మన్ కె.అజయ్ రెడ్డి పిటిషన్ను తిరస్కరించింది.


