News May 20, 2024
KMR: దినాలకొచ్చి.. ఆత్మహత్య చేసుకున్నాడు..!

దినాలకొచ్చిన..ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన KMR జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లిలో జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ (35)ఈ నెల13న మృతుడి భార్య సాగరిక తాత మరణించాడని అంత్యక్రియలకు వచ్చారు. అంత్యక్రియల అనంతరం మృతుడు శుక్రవారం కాటేపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. SI కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 13, 2025
SRSPకి వరద.. 22 గేట్ల ద్వారా నీరు విడుదల

ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఎగువ నుంచి 82,395 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 22 వరద గేట్ల ద్వారా 64,680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. IFFC ద్వారా 8 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 800, ఎస్కెప్ గేట్ల ద్వారా 8,000, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
News September 13, 2025
NZB: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 3 ఏళ్ల జైలు

వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి NZB 4వ అడిషనల్ మహిళ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. రెంజల్ మండల కేంద్రానికి చెందిన గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న పక్క ఇంట్లో నివసించే వివాహిత ఒంటరిగా ఉండగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడికి చేరుకుని కిరణ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు.
News September 12, 2025
NZB: యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం: మంత్రి

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం NZBరూరల్ MLAక్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రానికి సరిపడినంత యూరియా పంపకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. స్టాక్ పంపాలని విన్నపాలు చేసినప్పటికీ అడపాదడపా యూరియా పంపుతూ ఇక్కడి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు.