News May 21, 2024
పల్నాడుని వైసీపీ నేతలు వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల

AP: అధికారం కోల్పోతున్నామనే అక్కసుతో YCP నేతలు దాడులకు తెగబడ్డారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడుని YCP నేతలు వల్లకాడు చేశారని దుయ్యబట్టారు. కొందరు పోలీసులు YCPతో కుమ్మక్కై TDP కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు, ప్రజలు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు, పోలీసులపై YCP ఆరోపణలు చేస్తోందన్నారు.
Similar News
News January 4, 2026
ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు

ఏపీలో జనవరిలో స్కూళ్లకు దాదాపు సగం రోజులు సెలవులే ఉంటాయి. ఇవాళ (4), 10-18 తేదీల్లో 9 రోజులు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం. ఇవి అన్ని స్కూళ్లకు వచ్చే 12 సెలవులు. ఇక నగరాల్లోని CBSE సిలబస్, ఇంటర్నేషనల్ స్కూళ్లు శనివారాలూ హాలిడే పాటిస్తున్నాయి. దీంతో వారికి అదనంగా మరో 3 సెలవులు కలిపి ఈ మంత్లో 14 రోజులు హాలిడేస్ అన్నట్లు. తెలంగాణలో ఈ సంఖ్య 10-12 రోజులు.
News January 4, 2026
అఖండ2: OTT డేట్ ప్రకటించిన NETFLIX

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ2 OTT రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ముందుగా ఊహించినట్లుగానే ఈనెల 9న మూవీ డిజిటల్ రిలీజ్ ఉంటుందని రైట్స్ పొందిన NETFLIX ప్రకటించింది.
News January 4, 2026
రేపటి నుంచి జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రేపటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు తీవ్ర చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. డే టైమ్ టెంపరేచర్లు 25-26 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంటున్నారు. కాగా కొన్ని రోజులుగా ఉదయం పొగమంచు ఉంటున్నా చలి తీవ్రత తగ్గిన సంగతి తెలిసిందే.


