News May 21, 2024
రూ.7.08కోట్ల విదేశీ నిధులు సేకరించిన ఆప్: ఈడీ

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విదేశీ నిధుల సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఆప్ ఉల్లంఘించినట్లు పేర్కొంది. కెనడాలో సేకరించిన నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్తో సహా మరికొందరు తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారని తెలిపింది.
Similar News
News November 7, 2025
సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా రివ్యూ

లంకె బిందెలకు కాపలా ఉండే ధన పిశాచి, ఓ ఘోస్ట్ హంటర్ చుట్టూ జరిగే కథే ‘జటాధర’ మూవీ. ఆడియన్స్ పేషన్స్ను టెస్ట్ చేసే సినిమా ఇది. స్టోరీలో బలం, కొత్త ధనం లేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏమాత్రం మెప్పించదు. అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ అంశాలు, BGM ఫర్వాలేదనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ ఇబ్బందిపెడుతుంది. సాగదీత, ఊహకు అందే సీన్లు, రొటీన్ క్లైమాక్స్ నిరాశకు గురిచేస్తాయి. రేటింగ్: 1/5
News November 7, 2025
క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

ఏదైనా భారీ తప్పిదం జరిగినప్పుడు కంపెనీలు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పడం సహజమే. కానీ ఒకేసారి పలు కంపెనీలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే సరికొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్ను ఫాలో అవుతూ సరదాగా ట్వీట్ చేశాయా కంపెనీలు. ‘నాణ్యమైనవి చౌకగా ఇస్తున్నందుకు’ రిలయన్స్, సేఫ్టీలో కాంప్రమైజ్ కానందుకు స్కోడా & ఫోక్స్ వాగన్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.
News November 7, 2025
రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు

AP: ఇటీవల ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే DEC 13, FEB 14న కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి. మీకూ రేపు స్కూల్ ఉందా? COMMENT


