News May 21, 2024

జలుమూరు: ఒకే ఈతలో నాలుగు దూడలు

image

పాడి పశువులు సాధారణంగా ఒకటి లేదా రెండు దూడలకు జన్మనిస్తాయి. మూడు దూడలు జన్మించడం చాలా అరుదు. ఒకే ఈతలో నాలుగు దూడలు పుట్టిన ఘటన జలుమూరు మండలంలో చోటు చేసుకుంది. పెద్ద దూగాం గ్రామానికి చెందిన రైతు గుండ సింహాచలానికి చెందిన ఆవు సోమవారం ఒకే ఈతలో నాలుగు దూడలకు జన్మనిచ్చింది. రెండు మగ, రెండు ఆడ దూడలు జన్మించగా, రెండు గంటల వ్యవధిలో ఒక మగ దూడ, ఒక ఆడ దూడ మృతి చెందాయి. మిగిలిన రెండు ఆరోగ్యంగానే ఉన్నాయి.

Similar News

News March 2, 2026

శ్రీకాకుళం: 214కు చేరుకున్న డయేరియా కేసులు

image

శ్రీకాకుళం నగరంలో గత నెల 23 నుంచి ఆదివారం వరకు 214 డయేరియా కేసులు నమోదయినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. మొత్తం 116 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 94 మంది ఉన్నారని వెల్లడించారు. ఆదివారం నలుగురు ఆసుపత్రిలో చేరారని తెలిపారు. డయేరియా అదుపులో ఉందని, అధికారుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.

News March 2, 2026

SKKM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

మార్చి 2న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.

News March 1, 2026

SKLM: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరి మృతి

image

కోటబొమ్మాళి మండలం వాండ్రాడ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం కళ్యాణ శ్రీనివాసరావు (48) వాండ్రాడ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు తీవ్ర గాయాలు కాగా నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు.