News May 21, 2024
కల్లూరు: ఊయల మెడకు చుట్టుకుని బాలిక మృతి

పులిచెర్ల మండలం కల్లూరులో ప్రమాదవశాత్తు ఊయల మెడకు చుట్టుకుని 9 ఏళ్ల చిన్నారి మోమిన్ మృతి చెందినట్లు ఎస్సై రవిప్రకాశ్ రెడ్డి తెలిపారు. సదుం మండలానికి చెందిన మోమిన్ తన అక్కతో కలిసి కల్లూరులోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సోమవారం చీరతో చేసుకున్న ఊయలలో మోమిన్ ఊగుతూ మెడకు బిగుసుకోగా.. బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News March 13, 2026
చిత్తూరు జిల్లాకు రూ.115 కోట్ల మంజూరు

చిత్తూరు జిల్లాలో 2.05 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవకు సంబంధించి రూ.115 కోట్లు జమ కానున్నాయి. చిత్తూరులో 11,321 మంది రైతులకు రూ.6.32 కోట్లు, పూతలపట్టులో33,881- రూ.19.27 కోట్లు, పలమనేరు-38,368- రూ.21.71 కోట్లు, కుప్పం- 36,673- రూ.19.80 కోట్లు, పుంగనూరు- 37,191- రూ. 21.23 కోట్లు, నగరి- 12,472- రూ.7.06 కోట్లు, జీడీ నెల్లూరులో 36,047 మందికి రూ.20.43 కోట్లు మంజూరయ్యాయి.
News March 13, 2026
చిత్తూరు: పది పరీక్షలు.. 1210మంది ఇన్విజిలేటర్లు

టెన్త్ పబ్లిక్ పరీక్షలకు తొలి విడతగా 1210 మంది టీచర్లకు ఇన్విజిలేషన్ డ్యూటీలు వేసినట్లు చిత్తూరు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరంతా ఈనెల 16, 18, 21, 31, మే ఒకటో తేది పనిచేయాల్సి ఉందన్నారు. వీరికి 10KM పరిధిలోనే ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశామని చెప్పారు. ఎమర్జెన్సీ, గర్భిణులు, నిబంధనల ప్రకారం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధులు నిర్వహించ లేనివారు తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
News March 13, 2026
చిత్తూరు జిల్లాలో డబ్బుల వసూలు.. అసలు నిజం ఇదే!

చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల వేళ డబ్బులు ఇస్తే పాస్ చేస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై DEO రాజేంద్ర ప్రసాద్ విచారణ చేపట్టారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫేర్వెల్ డేకు నగదు తీసుకున్నారని చెప్పారు. ఈ డబ్బులే పరీక్షల్లో పాస్ చేయడానికి అని ప్రచారం చేయడం సరికాదన్నారు. చట్ట విరుద్ధ చర్యలకు చేపడితే కఠిన చర్యలు తప్పవని DEO హెచ్చరించారు.


