News May 21, 2024
కడప: విద్యార్థిని మిస్సింగ్ కేసు నమోదు

జిల్లాలోని బద్వేల్ పరిధిలోని కొంగలవీడుకు చెందిన జి. జ్యోతి (18) కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోందని, ఈనెల 19న బయటికి వెళ్లి తిరిగిరాలేదని ఆమె తల్లిదండ్రులు లక్ష్మిదేవి, గోపయ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి తెలియజేశారు.
Similar News
News December 31, 2025
భవిష్యత్లో మా టార్గెట్లు ఇవే: కడప SP

రాబోయే రోజుల్లో కడప జిల్లాను సాంకేతిక మరింత మెరుగుపరిచేలా చేస్తామని SP నచికేత్ తెలిపారు. AIను ఉపయోగించుకొని కార్యాలయ పనులు, రహదారి భద్రత పెంచుతామన్నారు. దర్యాప్తులను సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. PGRSలో వచ్చిన ఫిర్యాదులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో రౌడీయిజం లేకుండా చేస్తామన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గేలా చూస్తామన్నారు.
News December 31, 2025
భవిష్యత్లో మా టార్గెట్లు ఇవే: కడప ఎస్పీ

రాబోయే రోజుల్లో కడప జిల్లాను సాంకేతిక మరింత మెరుగుపరిచేలా చేస్తామని SP నచికేత్ తెలిపారు. AIను ఉపయోగించుకొని కార్యాలయ పనులు, రహదారి భద్రత పెంచుతామన్నారు. దర్యాప్తులను సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. PGRSలో వచ్చిన ఫిర్యాదులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో రౌడీయిజం లేకుండా చేస్తామన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గేలా చూస్తామన్నారు.
News December 31, 2025
2025: 657 మంది మిస్సింగ్.. 593 మంది ఆచూకీ లభ్యం: ఎస్పీ

2024 ఏడాదిలో 571 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 540 మంది ఆచూకి కనుగొని, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 2025 ఏడాదిలో 657 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 593 మంది ఆచూకి గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. గత ఏడాది 222 చీటింగ్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 221 కేసులు నమోదయ్యాయని వివరించారు.


