News May 21, 2024

వరంగల్‌లో రంజీ మ్యాచ్‌లు: జగన్

image

TG: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌లో రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. వరంగల్‌లో కొత్త స్టేడియం నిర్మాణంపై అపెక్స్‌లో చర్చిస్తామన్నారు. ‘త్వరలోనే వరంగల్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేస్తాం. ప్రతీ జిల్లాలో స్టేడియం నిర్మిస్తాం. రాష్ట్ర స్థాయి టీ20 టోర్నమెంట్ నిర్వహిస్తాం. ప్రతిభావంతులను గుర్తించేందుకే సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 9, 2026

మార్చి 31న సెలవు రద్దు: RBI

image

మార్చి 31(మహావీర్ జయంతి)న బ్యాంకుల సెలవు రద్దు చేస్తూ RBI ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం హాలీడే ఉన్నా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆ రోజున పనివేళలు కొనసాగించాలని తెలిపింది. 2025-26 FYలోపే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పరిగణనలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సాధారణ కార్యకలపాలపై కస్టమర్లు బ్రాంచ్‌ను ధ్రువీకరించుకోవడం ఉత్తమం.

News February 9, 2026

డ్రైవర్ నిర్లక్ష్యం.. 30 మంది మృతి

image

నైజీరియాలోని కానోలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 30 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ దేశంలో రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

News February 9, 2026

ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న నటుడు!

image

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుంచి ఆయన వైదొలిగినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు దీపికా పదుకొణే తప్పుకోగా ఆమె స్థానంలో హీరోయిన్‌గా తృప్తి దిమ్రిని తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది.