News May 21, 2024
కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ: పొంగులేటి

TG: ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ‘అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’ అని ఆయన హామీ ఇచ్చారు.
Similar News
News February 10, 2026
IPLకూ హర్షిత్ రాణా డౌటే!

టీమ్ ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా సోమవారం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ నుంచి మాత్రమే కాకుండా త్వరలో రాబోయే IPL సీజన్ నుంచి కూడా ఆయన దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రాణా గాయపడ్డారు. త్వరలో బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయనున్నారు.
News February 10, 2026
పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిసీజ్(ADHD) నిర్ధారణ అయిన వెంటనే కొందరు వైద్యులు మందులు సిఫార్సు చేస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్ఫర్డ్ మెడిసిన్ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. దాంతో ఈ చికిత్స వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదంటున్నారు. మందులకంటే ముందు వాళ్లకు బిహేవియరల్ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
News February 10, 2026
విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

AP: విశాఖ మెట్రోకు కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. CM చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రోకి అనుమతి ఇవ్వాలనే CM అభ్యర్థన మేరకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత మెట్రోకి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడే అవకాశముంది.


