News May 21, 2024
$5 ట్రిలియన్ల క్లబ్లో ఇండియన్ స్టాక్ మార్కెట్

చరిత్రలో తొలిసారి భారత స్టాక్ మార్కెట్ $5 ట్రిలియన్ల క్లబ్లో చేరింది. 6 నెలల కాలంలోనే ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల సంపద సృష్టించి రికార్డు నెలకొల్పింది. ఆ ఫలితంగా చరిత్రలో తొలిసారి ఈరోజు 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ ఫీట్ సాధించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం మార్కెట్ విలువ రూ.414.75లక్షల కోట్లకు చేరిందని అంచనా.
Similar News
News April 19, 2026
మధ్యాహ్నం వరకు ఎండలు.. ఆపై వర్షాలు

TG: ఇవాళ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా మధ్యాహ్నం నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 42–45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఆపై HYD, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, NZB, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
News April 19, 2026
మరో ఏడాదిపాటు చీఫ్ సెలక్టర్గా అగార్కర్!

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బోర్డు పొడిగించనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. 2027 జూన్ వరకు ఎక్స్టెండ్ చేయనున్నట్లు పేర్కొంది. 2023లో అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయిన తర్వాత భారత్ 2024, 2026 టీ20 వరల్డ్ కప్తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్టుల నుంచి రిటైర్ కావడానికి ఆయనే కారణమని విమర్శలూ వచ్చిన సంగతి తెలిసిందే.
News April 19, 2026
పవన్ త్వరలోనే కోలుకుంటారు: ప్రధాని మోదీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. సైనసైటిస్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్కు నిన్న <<19687368>>సర్జరీ<<>> జరిగిన సంగతి తెలిసిందే.


