News May 21, 2024
HYD: FINE ARTS యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్
HYD నగరం మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్ నియమితులయ్యారు. 1992 IAS బ్యాచ్ అధికారి అయిన జయేశ్, అనేక ఉన్నత పదవులు చేపట్టి, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను తాజాగా.. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీగా వీసీగా ప్రభుత్వం నియమించింది.
Similar News
News October 3, 2024
HYD: యూనివర్సిటీ ర్యాంకుల FULL REPORT
✓HYDలోని ఆర్మీ డెంటల్ కాలేజ్ ఇండియాలో 40వ ర్యాంకు సాధించింది
✓ఉస్మానియా మెడికల్ కాలేజ్ 48వ ర్యాంకు సాధించింది
✓న్యాయవిద్యలో నల్సార్ యూనివర్సిటీకి 3వ ర్యాంకు
✓ఇన్నోవేషన్ విభాగంలో IITH మూడో ర్యాంకు
✓పరిశోధనల్లో IITH 15, HCU 18 ర్యాంకు
✓వ్యవసాయ కళాశాలల్లో జయశంకర్ యూనివర్సిటీ 37వ ర్యాంకు
✓IIIT HYD టాప్ 100 యూనివర్సిటీలో 74వ ర్యాంక్
News October 3, 2024
రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం: సీపీ
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
News October 2, 2024
BREAKING: HYD: KTRపై PSలో ఫిర్యాదు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTRపై HYD వనస్థలిపురం PSలో కాంగ్రెస్ నేత, TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాలనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ఈ ప్రణాళిక చేశారని ఇటీవల KTR ఆరోపించారు. సీఎంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన KTRపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.