News May 22, 2024

రైల్లో లగేజీ కొరికేసిన ఎలుకలు.. ప్రయాణికుడి ఆవేదన

image

ఫస్ట్ ఏసీలో ప్రయాణిస్తున్న వ్యక్తికి సంబంధించిన లగేజీని ఎలుకలు కొరికేయడం నెట్టింట చర్చనీయాంశమైంది. సదరు ప్రయాణికుడు రైల్వేను ట్యాగ్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఫిర్యాదు చేసేందుకు కూడా అధికారులెవరూ లేరని వివరించారు. అతడి పోస్టు వైరల్ కావడంతో స్పందించిన రైల్వే సేవ పూర్తి వివరాలను పంపించాలని కోరింది. రైళ్ల నిర్వహణలో లోపాలపై ఇటీవలి కాలంలో నెట్టింట తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News January 12, 2026

చిరు-బాలయ్య కాంబో సాధ్యమేనా?

image

మన శంకరవరప్రసాద్ గారు మూవీలో సీనియర్ స్టార్లు చిరంజీవి, వెంకటేశ్ చేసిన సందడికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి, బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ మూవీ చేయాలనుందని గతంలో చిరంజీవి చెప్పారు. రామ్ చరణ్, జూ.NTRతో రాజమౌళి తీసిన RRR ప్రపంచవేదికపై సత్తా చాటింది. ఇప్పుడు చిరు-బాలయ్య సినిమా వస్తే పండగేనని ఫ్యాన్స్ అంటున్నారు. మీరేమంటారు?

News January 12, 2026

మెస్సీ ఓ మాట చెప్పాడంతే.. ₹లక్ష కోట్లు పెరిగిన సంపద!

image

సెలబ్రిటీలు చేసే చిన్న పనులు కూడా కొన్ని కంపెనీలపై భారీ ప్రభావం చూపిస్తాయి. ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ క్యాజువల్‌గా చెప్పిన మాట కోకా-కోలాకు సిరులు కురిపించింది. ‘నాకు వైన్ అంటే ఇష్టం. స్ర్పైట్ కలుపుకుని తాగుతా’ అని ఆయన చెప్పారు. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా ఎగిశాయి. 3రోజుల్లో 12.9బిలియన్ డాలర్ల(₹1.16లక్షల కోట్లు) సంపద పెరిగింది. 2021లో రొనాల్డో కోకా-కోలా ప్రొడక్టును పక్కనపెట్టడంతో $4Bను కోల్పోయింది.

News January 12, 2026

2026లో యుగాంతం.. నిజమెంత?

image

కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారీ ‘యుగాంతం’ థియరీలు ముందుకొస్తుంటాయి. బాబా వాంగ వంటి వారిని పేర్కొంటూ ఊహాగానాలు పుట్టుకొస్తాయి. AI ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి దానికి సంకేతాలంటూ SMలో స్టోరీలు ఇప్పుడు వైరలవుతున్నాయి. ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తారనే చర్చా జరుగుతుంది. వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చరిత్ర చెబుతోంది. కేవలం SM ఆల్గారిథమ్ వల్లే ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.