News May 22, 2024
కర్నూలు: కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ఎస్పీ
కర్నూలులో ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులు వేసిన చోట కాకుండా వేరే బూత్లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కామేశ్ నాయక్ను ఎస్పీ కృష్ణకాంత్ సస్పెండ్ చేశారు. కామేశ్ నాయక్ కృష్ణానగర్లో ఉన్న ఓ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకు డ్యూటీ వేశారు. ఆయన సిల్వర్ జూబ్లీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయించారని వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News October 2, 2024
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీటు
బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
News October 1, 2024
సీఎం సమక్షంలో హామీ ఇచ్చిన మంత్రి టీజీ భరత్
కర్నూలు జిల్లాలో త్వరలోనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో సీఎంతో కలిసి ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో టమోటా పంటను ఎక్కువగా సాగు చేస్తారన్నారు. యూనిట్ నెలకొల్పేందుకు ఉన్న వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం సమక్షంలో చెప్పారు.
News October 1, 2024
జాతీయ స్థాయి పోటీలకు పత్తికొండ విద్యార్థి ఎంపిక
పత్తికొండ ఏపీ మోడల్ స్కూలు సీఈసీ రెండో ఏడాది విద్యార్థి బోయ తేజేశ్వర్ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్, పీడీ రాజశేఖర్ నాయక్ తెలిపారు. విద్యార్థిని కళాశాల బృందం అభినందించింది.