News May 22, 2024
యాక్సిడెంట్కు ముందు బార్లో రూ.48 వేలు ఖర్చు చేసి..!

పుణేలో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడైన టీనేజర్ ప్రమాదానికి ముందు ఓ బార్లో గంటన్నరలోనే రూ.48 వేలు ఖర్చు చేశాడు. అక్కడి నుంచి వెళ్లి మరో బార్లో కూడా తన స్నేహితులతో కలిసి మద్యం తాగి కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి 25 ఏళ్లు వచ్చేవరకూ డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వబోమని పోలీసులు తెలిపారు.
Similar News
News April 20, 2026
విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.
News April 20, 2026
8th పే కమిషన్.. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.
News April 20, 2026
హ్యాపీ బర్త్డే మావయ్య: NTR

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.


