News May 22, 2024

ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం: CEO ముకేశ్

image

AP: మాచర్లలో EVM ధ్వంసం కేసులో YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A1గా చేర్చినట్లు CEO ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామన్నారు. ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. నిన్నటి నుంచి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Similar News

News October 18, 2025

నెలసరికి ముందు ఇవి మేలు..

image

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే PMS అంటారు. దీని లక్షణాలను తగ్గించడానికి ఆహారంలో డ్రైఫ్రూట్స్‌, మిల్లెట్స్‌, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు తగ్గించాలి. ఇవి ఈస్ట్రోజన్, ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్లపై ప్రభావం చూపడం వల్ల నెలసరి సమస్యలు వేధిస్తాయి.

News October 18, 2025

పండుగవేళ ఆఫర్ల మాయలో పడకండి

image

పండుగ సమయాల్లో వివిధ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఒక్కసారి వాటి మాయలో పడితే బడ్జెట్ దాటిపోయి పండుగ సంతోషం ఆవిరైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే అప్పులు తీసుకొని షాపింగ్ చేయడం మానుకోవాలి. వస్తువు కొనేముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. నాణ్యతలో రాజీ పడకూడదు. డిస్కౌంట్లు ఏ వెబ్‌సైట్‌లో తక్కువగా వస్తున్నాయో చెక్ చేసుకోవాలి. తక్కువకు వస్తున్నాయి కదా అని అనవసరమైనవి కొనొద్దు.

News October 18, 2025

వర్కింగ్ ఉమెన్స్.. ఒత్తిడి తగ్గాలంటే?

image

ఇంట్లో, ఆఫీసులో పనుల కారణంగా వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువగా ఒత్తిడి గురవుతుంటారు. అలాంటివారు రోజూ మెడిటేషన్, వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘మీకు వచ్చినా, రాకపోయినా కాగితాలపై బొమ్మలు, పెయింటింగ్స్ వేయాలి. దీనివల్ల మీ ఫోకస్ పెరుగుతుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని తినాలి. మొబైల్ ఫోన్ పక్కనపెట్టి పిల్లలు, పెట్స్‌తో ఆడుకోవడం, మ్యూజిక్ వినడం స్ట్రెస్ తగ్గించడంలో మేలు చేస్తాయి’ అని పేర్కొంటున్నారు.