News May 22, 2024
BREAKING: గుంటూరులో పట్టపగలు దారుణ హత్య

గుంటూరులో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శారదా కాలనీ సమీపంలోని సంజీవనగర్ వద్ద బుధవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలుపు చొక్కా, గ్రే కలర్ ప్యాంటు ధరించిన ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతంగా పొడిచి హత్య చేసి పరారైనట్లు తెలుస్తుంది. మృతుని వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Similar News
News December 31, 2025
GNT: పోటాపోటీగా నేతల పర్యటనలు.. క్యాడర్ అయోమయం.!

తాడికొండ నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సుచరిత, ప్రస్తుత ఇన్ఛార్జ్ డైమండ్ బాబు పోటాపోటీ పర్యటనలు చేస్తున్నారు. ఏడాదికి పైగా రాజకీయాలకు దూరంగా ఉన్న సుచరిత తాజాగా నియోజకవర్గంలో వరుస పర్యటనలతో తాడికొండ YCP రాజకీయం కాస్త ఆసక్తిగా మారి.. గ్రూపు రాజకీయాలు మరింత బలపడ్డాయి. క్షేత్రస్థాయి క్యాడర్ ఎటువైపు ఉండాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. చివరికి ఇద్దరూ కాకుండా వేరొక వ్యక్తి వస్తారనే టాక్ కూడా నడుస్తోంది.
News December 30, 2025
తెనాలి: పోక్సో కేసులో నిందితుడికి జైలు, జరిమానా.!

ప్రేమ పేరుతో బాలికను వేధించిన కేసులో నిందితుడికి 2 ఏళ్ల జైలు, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తెనాలి ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సుల్తానాబాద్లో 14 ఏళ్ల బాలికను 22 ఏళ్ల తమ్మిశెట్టి వినయ్ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయగా బాలిక తల్లి 2022 మే 2న త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం కేసు విచారించిన పోక్సో స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి సాక్షాదారాలను పరిశీలించి నిందితుడికి జైలు జరిమానా విధించారు.
News December 30, 2025
గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్లకు భారీ డిమాండ్

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బేకరీలు, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కేకులు, స్వీట్లు ధరలు సాధారణ రకం రూ. 200 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రత్యేక డిజైన్ కేకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కుటుంబాలు, యువత కొత్త సంవత్సరాన్ని మధురంగా ఆహ్వానించేందుకు ముందస్తుగా ఆర్డర్లు ఇస్తుండటంతో వ్యాపారుల్లో ఉత్సాహం నెలకొంది.


