News May 22, 2024

KKR కోసం అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలేసి వచ్చా: గుర్బాజ్

image

తన తల్లి ఆస్పత్రిలో ఉన్నప్పటికీ KKR జట్టు కోసం తిరిగి ఇండియాకు వచ్చినట్లు KKR వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ చెప్పారు. తన తల్లి అనారోగ్యం కారణంగా పదిరోజుల క్రితం అఫ్గానిస్థాన్‌కి వెళ్లిన గుర్బాజ్.. KKR మేనేజ్మెంట్ పిలుపుతో మళ్లీ ఇండియాకు చేరుకున్నారు. కష్టమైనప్పటికీ తన తల్లి ఆశీస్సులు తీసుకొని తిరిగొచ్చినట్లు మీడియాతో చెప్పుకొచ్చారు. SRHతో మ్యాచ్‌లో 14 బంతుల్లో 23 పరుగులు చేశారు.

Similar News

News November 3, 2025

ఉమెన్స్ WC ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

image

టీమ్ ఇండియా ICC ఉమెన్స్ వన్డే <<18182320>>వరల్డ్ కప్<<>> విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కప్పు కొట్టిన భారత్‌కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ SA జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. ఈ WCలో ప్రైజ్‌మనీ+బోనస్‌లు+పార్టిసిపేషన్ ఫీ+BCCI కార్యదర్సి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంటుంది.

News November 3, 2025

‘పుల్లోరం’ కోడి పిల్లలకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.

News November 3, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

image

AP: బాపట్లలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారు బాపట్ల MLA నరేంద్ర వర్మ బంధువులని సమాచారం. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54), బలరామరాజు(65), లక్ష్మి(60)గా గుర్తించారు.