News May 22, 2024
KKR కోసం అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలేసి వచ్చా: గుర్బాజ్

తన తల్లి ఆస్పత్రిలో ఉన్నప్పటికీ KKR జట్టు కోసం తిరిగి ఇండియాకు వచ్చినట్లు KKR వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ చెప్పారు. తన తల్లి అనారోగ్యం కారణంగా పదిరోజుల క్రితం అఫ్గానిస్థాన్కి వెళ్లిన గుర్బాజ్.. KKR మేనేజ్మెంట్ పిలుపుతో మళ్లీ ఇండియాకు చేరుకున్నారు. కష్టమైనప్పటికీ తన తల్లి ఆశీస్సులు తీసుకొని తిరిగొచ్చినట్లు మీడియాతో చెప్పుకొచ్చారు. SRHతో మ్యాచ్లో 14 బంతుల్లో 23 పరుగులు చేశారు.
Similar News
News January 20, 2026
ఖమ్మంలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం

ఖమ్మం రమణగుట్టలో సంచలనం రేపిన శైలజ(26) మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనారోగ్యంతో మరణించిందని నమ్మించి భర్త సురేందర్ హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించగా, అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ పర్యవేక్షణలో సోమవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధం కోసమే ఇంజెక్షన్తో భార్యను హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
News January 20, 2026
ఆర్సీబీ సరికొత్త చరిత్ర

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్లో RCB తన చివరి మ్యాచ్లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్పై కన్నేసింది. నిన్న గుజరాత్తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
News January 20, 2026
ఏ బాటిల్లో నీటిని నిల్వ చేస్తున్నారు?

తాగే నీటిని నిల్వ చేసే సీసా కూడా రుచిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాగి సీసాలో 16 గంటల పాటు నీటిని నిల్వ ఉంచి తాగితే శరీరానికి మేలు చేస్తుంది. అయితే వీటిలో నిమ్మరసం వంటివి నిల్వ చేయకూడదు. గాజు సీసా నిల్వకు ఉత్తమం. ఇందులో ఎలాంటి రసాయనచర్యలు ఉండవు. తేలికగా ఉంటాయని వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా పాతబడ్డవి వాడకపోవడం మేలు.


