News May 22, 2024
శ్రీకాకుళం: ‘కొరియర్ కాల్స్పై అప్రమత్తత అవసరం’
కొరియర్ పేరుతో వచ్చే కాల్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దీపిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్లైన్లో బుక్చేసిన ఐటమ్ యొక్క పార్సల్౨లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని కేసు నమోదైందని సీబీఐ లేదా పోలీసుల మంటూ సైబర్ నేరగాళ్లు బెదిరిస్తారని చెప్పారు. విచారణకు రమ్మంటారని, రాలేమంటే ఆన్లైన్లోనే రావచ్చునని చెప్పి, ఓ లింక్ పంపిస్తారని దాన్ని తెరిస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయని ఎస్పీ వివరించారు.
Similar News
News October 1, 2024
శ్రీకాకుళం: మొదలైన మద్యం అమ్మకాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైన్ షాప్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో ఉదయం నుంచి సేల్స్ మాన్లు, సూపర్వైజర్లు మద్యం అమ్మకాలు చేపట్టకుండా సమ్మె చేశారు. జిల్లాలో 193 ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసిన సేల్స్ మెన్లు, సూపర్వైజర్ల కాంట్రాక్ట్ నిన్నటితో ముగిసింది. వీరితో చర్చించి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు చేపట్టాలని సూచించడంతో 5గంటలనుంచి ప్రారంభించారు.
News October 1, 2024
కలెక్టర్ని కలిసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే
ఇచ్ఛాపురం నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కవిటి, సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలంలో ప్రధాన సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
News October 1, 2024
శ్రీకాకుళం: 12 మంది సీఐ, 21 మంది ఎస్సైలు బదిలీ
ఎక్సైజ్ Dy కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 12 మంది CI లను నూతనంగా నియమించారు. 21 మంది SIలు బదిలీ జరిగింది. CIలు గోపాలకృష్ణ-శ్రీకాకుళం, సతీష్ కుమార్-ఆమదాలవలస, అనురాధాదేవి-రణస్థలం, రాజు-పొందూరు, రమణమూర్తి-నరసన్నపేట, కృష్ణారావు-పాతపట్నం, కిరణ్మణీశ్వరి-కొత్తూరు, మీరాసాహెబ్-టెక్కలి, గాయత్రి-కోటబొమ్మాళి, మల్లికార్జునరావు-పలాస, బేబీ-సోంపేట, ప్రసాద్-ఇచ్ఛాపురానికి నియమితులయ్యారు.