News May 22, 2024
VZM: పది సప్లమెంటరీ పరీక్షలు రాయనున్న 4,210 మంది విద్యార్థులు

ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభకానున్నాయి. పరీక్ష ఉదయం 9.30కి మొదలై మధ్యాహ్నం 12.45కి ముగుస్తుంది. జిల్లాలో మొత్తం 4,210 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 2,482 మంది బాలురు, 1728 మంది బాలికలు ఉన్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Similar News
News April 23, 2025
VZM: నేడే పది ఫలితాలు.. ఒక్క క్లిక్తో..!

బుధవారం ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్తో వే2న్యూస్లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it
News April 22, 2025
సివిల్స్లో 830వ ర్యాంక్ సాధించిన రాజాం యువకుడు

రాజాం మండలం సారధికి చెందిన వావిలపల్లి భార్గవ మంగళవారం విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 830వ ర్యాంక్ సాధించారు. నాలుగుసార్లు UPSC ఇంటర్వ్యూల వరకు వెళ్లి విఫలమైయారు. 5వ ప్రయత్నంలో సివిల్స్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పిడుగురాళ్ల సర్కిల్ కమిషనర్గా భార్గవ పనిచేస్తున్నారు. ఇయన తండ్రి విష్ణు ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
News April 22, 2025
VZM: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్తో..!

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్తో వే2న్యూస్లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it