News May 22, 2024
అప్పుల బాధ ఎక్కువై యువ రైతు ఆత్మహత్య
బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యువ రైతు అప్పుల బాధ ఎక్కువై గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలకు వెళితే.. ప్రవీణ్ కుమార్ వ్యవసాయంలో అప్పులు కావడంతో తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతణ్ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు ఆవరించాయి.
Similar News
News October 1, 2024
కడప: రోడ్డు ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు?
కడప జిల్లా YVU యూనివర్సిటీ వద్ద సోమవారం రాత్రి కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కాళ్లు విరిగి పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంగా పరిగనించి వేలూరు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో కేవలం కాళ్లకు మాత్రమే కత్తితో నరికిన గాయాలు ఉండగా.. చివరికి <<14239401>>ఎవరో కాళ్లను నరికినట్లు<<>> అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులతోపాటు వారి బంధువులు కూడా అనుమానిస్తున్నారు.
News October 1, 2024
కడప: ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చిన వారికి బహుమతులు.. వివరాలివే.!
కడపలోని రాజీవ్ పార్క్ వద్ద <<14237927>>నేటి సాయంత్రం 5 గంటలకు<<>> నిర్వహించే కార్యక్రమానికి ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చేవారికి ఇచ్చే గిఫ్ట్లు ఇవే.
1బాటిల్కి ఒక చాక్లెట్
1కేజీ ప్లాస్టిక్కు ఒక పెన్, మొబైల్ స్టాండ్
3కేజీల ప్లాస్టిక్కు పుష్బిన్
5 కేజీలకు డస్ట్బిన్ &ఫ్లవర్పాట్
15కేజీల ప్లాస్టిక్కు టీషర్ట్
500kgల ప్లాస్టిక్కు ఒక బెంచ్ గిఫ్ట్గా ఇస్తామని కలెక్టర్ తెలిపారు. వివరాలకు 9949831750ఫోన్ చేయాలన్నారు.
News October 1, 2024
కడప జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమలు
జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కట్టుదిట్టంగా, పూర్తిగా పారదర్శకంగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మద్యం దుకాణాల పాలసీపై జిల్లా కలెక్టర్ సంబంధిత ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాలను కేటాయించుటకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నదని చెప్పారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో 139 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నామన్నారు.