News May 22, 2024

 ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి..

image

చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దామరచర్లలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నాగరాజు పెద్ద కుమారుడు నాగధనుష్, ఆయన మరదలు కుమారుడు పెద్ది శెట్టి సాత్విక్ కొంతమంది పిల్లలతో కలిసి గ్రామ శివారులోని నాగుల చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈక్రమంలో వారికి ఈత రాక మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News October 2, 2024

NLG: సర్వేకు వెంటనే బృందాలను ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు సర్వేకు జిల్లాలో వెంటనే బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్‌లతో కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఏర్పాటు అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News October 2, 2024

భువనగిరి: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సమీక్ష సమావేశం

image

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News October 1, 2024

NLG: పోలీసుల కనుసన్నల్లోనే కేటీఆర్‌పై దాడి: జగదీశ్ రెడ్డి

image

తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి హేయమైన చర్య అన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం దాడి జరిగింది అని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు అని తెలిపారు.