News May 22, 2024
ఏలూరు: అందుబాటులో టెన్త్, ఇంటర్ హాల్ టికెట్స్
ఏపీ దూరవిద్య ద్వారా జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను ఆన్లైన్లో పొందుపరిచామని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. www.apopenschool.ap.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు ఉన్నాయని చెప్పారు. లేదా ఓపెన్ స్కూల్స్ సెంటర్ల కో-ఆర్డినేటర్ల నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చు అని స్పష్టం చేశారు.
Similar News
News September 29, 2024
జగన్కు పరిపాలన చేయడం రాదు: మంత్రి నారాయణ
ఏపీ మాజీ సీఎం జగన్కు పరిపాలన చేయడం రాదని మంత్రి నారాయణ అన్నారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం చంద్రబాబు అన్నారని చెప్పారు. పాలకొల్లులోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News September 29, 2024
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై చీటింగ్ కేసు
ఏలూరు మాజీ MLA ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది. త్రీ-టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచార సమయంలో ఏలూరులోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన తనను ఆదుకుంటానని, వైద్య ఖర్చులు భరిస్తానని చెప్పిన ఆళ్ల నాని.. ఆ తర్వాత పట్టించుకోలేదని అవుటుపల్లి నాగమణి అనే మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో నానితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు.
News September 29, 2024
TDP ఉభయ గోదావరి జిల్లాల MLC అభ్యర్థి ఖరారు..?
TDP ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు లేదా SC సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి జవహర్తో పాటు పలువురి పేర్లు పరిశీలించినా, చివరికి ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐ.పోలవరానికి చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా జనసేనకు ఇచ్చారు.