News May 22, 2024

NGKL: గిరిజన విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండి !

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 2024-25 విద్యాసంవత్సరం 3,5,8 తరగతుల్లో ప్రవేశానికి గాను జిల్లాకు చెందిన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. 3వ తరగతిలో 10 సీట్లు 5లో 6 సీట్లు, 8లో 4 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 7, 2026

MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

image

స్వల్ప గొడవ విషయంలో తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నవాబుపేట మండలం గురుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ (21) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. హోలీ వేడుకల్లో స్నేహితులతో గొడవపడటంతో ఇంటి పెద్దలు మందలించారు. దీనిని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

News March 7, 2026

MBNR: రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ స్టేజ్ వద్ద నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారిలో ఒకరు కొత్తకోట మండలం వడ్డేవాట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ రవి, మరొకరు కొత్తకోటకు చెందిన హమాలీ కూలీ నాగన్నగా గుర్తించారు. గాయాల పాలైన ఆర్టీసీ డ్రైవర్ పురుషోత్తం (58) చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు.

News March 6, 2026

MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

image

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.