News May 23, 2024
స్టాక్ మార్కెట్ల ఆల్ టైమ్ రికార్డ్!

దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీ జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 75వేల మార్క్ దాటి గరిష్ఠంగా 75,499కు చేరింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 75,418 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ గరిష్ఠంగా 22,993 పాయింట్లను నమోదు చేసి 22,967 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద రూ.3.8లక్షల కోట్లు పెరిగి రూ.420 లక్షల కోట్లకు చేరింది. BSEలో 212 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేయడం విశేషం.
Similar News
News November 8, 2025
ALERT: పశువులకు ఈ టీకా వేయించారా?

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. ఈ నెల 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాను పశువులకు వేయించడంలో పాడి రైతులు నిర్లక్ష్యం చేయొద్దు.✍️ రోజూ సాగు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 8, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.
News November 8, 2025
పిల్లల్లో మల బద్ధకం తగ్గాలంటే..

చాలామంది పేరెంట్స్ పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదాని బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, నూడుల్స్, పెరుగన్నం వంటివి పెడతారు. వీటివల్ల ఆకలి తీరుతుంది కానీ మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల ఆహారంలో పీచు పదార్థాలు చేర్చాలని సూచిస్తున్నారు. దీనికోసం పొట్టుతో ఉన్న ఓట్స్, మిల్లెట్స్, గోధుమ పిండి, బెండకాయ, చిక్కుడు, వంకాయ, క్యారెట్ ఇస్తే మలబద్ధకం తగ్గుతుందంటున్నారు.


