News May 23, 2024
శ్రీకాకుళం: మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: APSDMA

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం నాటికి క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తుఫాను కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు ఈ మేరకు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరాలకు ఈ తుఫాను తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని APSDMA స్పష్టం చేసింది.
Similar News
News January 13, 2026
కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.


