News May 24, 2024
సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని విధాలా సన్నద్ధం: కలెక్టర్

సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని కలెక్టర్ డా.జీ.సృజన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News January 17, 2026
మళ్లీ చెప్పున్నా.. జాగ్రత్త: కర్నూలు ఇన్ఛార్జ్ ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు SMలో ఫేక్ లింకులు పంపి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను డీఐజీ, కర్నూలు ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్, అమ్మఒడి వంటి పథకాల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు వస్తే 1930కు ఫోన్ చేయాలన్నారు.
News January 16, 2026
పాణ్యం మండలంలో విషాదం

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్పాత్పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News January 16, 2026
కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.


