News May 24, 2024

ఎయిర్ ఇండియా ఉద్యోగుల వేతనాలు పెంపు

image

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తమ ఉద్యోగులకు జీతాలు పెంచింది. దీంతో పాటు పైలట్ల పనితీరు ఆధారంగా బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా CHRO రవీంద్రకుమార్ వెల్లడించారు. ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఎయిర్ ఇండియాలో ప్రస్తుతం 18వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News April 19, 2026

ట్రంప్-మునీర్ మైత్రి: అమెరికాకే ప్రమాదం!

image

ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఎంచుకోవడాన్ని అమెరికా రక్షణ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇరాన్ సైన్యం, నిఘా సంస్థలు, IRGC నేతలతో ఆయనకు ఏళ్ల నుంచి ఉన్న సంబంధాలే ఇందుకు కారణం. గతంలో అఫ్గాన్ విషయంలో మిత్రదేశంగా నటిస్తూనే తాలిబన్లకు సహకరించిన పాక్ ద్వంద్వ నీతిని మరువరాదని, మునీర్‌ను నమ్మడం వల్ల US వ్యూహాత్మక రహస్యాలు ఇరాన్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

News April 19, 2026

కీవ్‌ సూపర్ మార్కెట్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి!

image

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌లోని హోలోసివ్స్కీ జిల్లాలో వీధిలో వెళ్తున్న వారిపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం సూపర్ మార్కెట్‌లోకి దూరి కొంతమందిని బందీలను చేసుకున్నాడు. సుమారు 40 నిమిషాల ఉత్కంఠ తర్వాత ప్రత్యేక దళాలు (KORD) జరిపిన ఆపరేషన్‌లో నలుగురు బందీలను విడిపించారు. దుండగుణ్ని కాల్చి చంపారు.

News April 19, 2026

ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

image

1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ మరణం.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం.
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (ఫొటోలో) జననం.
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.