News May 24, 2024

కడప: ALERT.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

image

కడప జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, టెన్త్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 37 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 17,688 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 16 పరీక్షా కేంద్రాల్లో 3528 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని RIO స్పష్టం చేశారు.

Similar News

News October 16, 2024

కడప జిల్లాలో నేడు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ శివశంకర్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు డీఈవో మర్రెడ్డి అనురాధ సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు తప్పనిసరిగా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు.

News October 16, 2024

కడప జిల్లాకు రెడ్ అలర్ట్

image

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగండం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ కడప, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈక్రమంలో ఈ రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులను సిద్ధం చేశారు.

News October 16, 2024

సజావుగా ఇసుక పంపిణీ చేయాలి: కడప కలెక్టర్

image

ప్రజలకు సజావుగా ఇసుక పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని కడప జిల్లా కలెక్టర్ శంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై సంబంధిత అధికారులతో, ఇసుక ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో ఇసుకను అందించాలని ప్రభుత్వానికి, జిల్లాకు ప్రతిష్ఠలు తీసుకురావాలని చెప్పారు.